న్యాల్కల్, డిసెంబర్ 27 : న్యాల్కల్ మండలంలోని బసంత్పూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్టు హద్నూర్ ఎస్ఐ వినయ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని గోడంపల్లి గ్రామానికి చెందిన ఎల్లప్ప తన చెల్లెలు కవిత, అల్లుడు వినయ్ కలిసి ఆదివారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డిపల్లికి బైక్పై వస్తున్నారు.
ఈ క్రమంలో బసంత్పూర్ గ్రామ శివారులో బైక్పై నుంచి కవిత(34) కింద పడి మృతిచెందింది. ఆమెతో పాటు ఉన్న కుమారుడు వినయ్(12) కూడా కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వినయ్కుమార్ పేర్కొన్నారు.