పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
పటాన్చెరు, మే 26 : పటాన్చెరు పట్టణంలో నాలుగు దశాబ్దాల క్రితం వేసిన మంచినీటి పైపులైన్లు మార్చుతున్నామని, నూతన పైపులైన్లతో సురక్షితమైన తాగునీటిని అందిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలో నూతనంగా రూ. 4.5 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న పైపులైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పోలీస్స్టేషన్ నుంచి జలమండలి కార్యాలయం ముందు వరకు పైపులైన్ వేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పోలీస్స్టేషన్ నుంచి నక్కవాగు వరకు పైపులైన్ వేస్తామన్నారు. పట్టణ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని ఇచ్చేందుకు కొత్త పైపులైన్ వేస్తున్నామని తెలిపారు. పాతకాలం నాటి పైపులైన్ పలు చోట్ల లీకేజీలతో ఉందన్నారు. గోదావరి జలాలు రావడంతో ప్రజలకు నిరంతరం తాగునీరు అందుబాటులో ఉందన్నారు. పాత పైపులైన్లపై ప్రత్యేక దృష్టి సారించామని, వాటిని సైతం తొలిగించి నూతనంగా నీటి సరఫరా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ మాట్లాడుతూ పట్టణంలో సురక్షితమైన తాగునీరు అందజేసేందుకు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఎమ్మెల్యే సహకారంతో పటాన్చెరు అభివృద్ధి పథంలో ముందున్నదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ భీంరెడ్డి, సీఐలు వేణుగోపాల్రెడ్డి, శ్రీనివాస్, జలమండలి అధికారులు, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాఘవేందర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అఫ్జల్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
లయన్స్క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకం
పటాన్చెరు, మే 26 : లయన్స్క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని వైకుంఠధామంలో మౌలిక వసతుల కల్పనకోసం లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో రూ. 10 లక్షలను ఎమ్మెల్యేకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లయన్స్క్లబ్ సభ్యులను అభినందించారు. లయన్స్క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములుగౌడ్, పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి, బల్దియా అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.