జహీరాబాద్, మే 18 : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో సరిహద్దుల్లో రెండు చెక్పోస్టులను ఏర్పా టు చేసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ చెక్పోస్టులను సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి పర్యవేక్షణ చేస్తున్నారు. వారం రోజుల్లో రెండు సార్లు జహీరాబాద్లో పర్యటించి లాక్డౌన్ పరిస్థితిని సమీక్ష చేసి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, కర్ణాటక సరిహద్దులో ఉన్న రెండు ప్రధాన రోడ్లుపై పోలీసు, రెవెన్యూ, వైద్యశాఖ ఆధ్వర్యంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ప్రతి చెక్పోస్టు వద్ద ఇద్దరు ఎస్ఐలు విధి నిర్వహణలో ఉంటున్నారు. ప్రతిరోజు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, పట్టణ, రూరల్ సీఐలు రాజశేఖర్, నాగేశ్వరావు పర్యవేక్షణ చేస్తున్నారు. 65వ జాతీయ రహదారిపై చెరాక్పల్లి శివారులో కర్ణాటక సరిహద్దులో చెక్పోస్టు ఏర్పాటు చేసి అనుమతి లేని వాహనాలను సరిహద్దు వద్ద నిలిపివేస్తున్నారు.
సరిహద్దు రోడ్లపై పెట్రోలింగ్..
జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక ప్రాంతంలో ఉండడంతో కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తారు. ప్రతిరోజు హైదరాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగడంతో ఎస్పీ ఆదేశాల మేరకు కోహీర్ మండలంలోని మనియార్పల్లి గ్రామ శివారు వరకు పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని మల్చల్మా శివారు వరకు పెట్రోలింగ్ చేస్తున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని చించోళి తాలూకా పరిధిలోని కుంచారం ప్రజలు ప్రతిరోజు జహీరాబాద్కు వస్తారు. దీంతో అక్కడ ప్రజలు తెలంగాణ సరిహద్దులోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొగుడంపల్లి మండలంలోని చించోళి రోడు, జహీరాబాద్ మం డలంలోని బుచినెల్లి శివారులో ఉన్న కర్ణాటక సరిహద్దు వరకు చెరాగ్పల్లి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. న్యాల్కల్ మండలంలోని జహీరాబాద్-బీదర్ రోడ్డుపై గణేశ్పూర్ శివారులో పోలీసు చెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. డప్పూర్, చికూర్తి రోడ్డుపై హద్నూర్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి, తనిఖీలు చేస్తున్నారు.
పట్టణంలో పకడ్బందీగా లాక్డౌన్..
జహీరాబాద్లో లాక్డౌన్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. సోమవారం ఎస్పీ జహీరాబాద్ పట్టణంలో పర్యటించి లాక్డౌన్ పరిస్థితి పరిశీలించారు. లాక్డౌన్ నిబంధలు అమలు చేయని వ్యాపారులు, ప్రజలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్, భవానీ మందిర్ చౌరస్తా, పస్తాపూర్ చౌరస్తా, శాంతినగర్, రాంనగర్ తదితర ప్రాం తాల్లో అమలు చేస్తున్న లాక్డౌన్ పరిస్థితిని తెలుసుకున్నారు. జహీరాబాద్లో కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్నాయని, నివారణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.