ఝరాసంగం ఎస్సై (2) సమద్
ఝరాసంగం, ఏప్రిల్ 18: మండల కేంద్రమైన ఝరాసంగంతోపాటు అన్ని గ్రామాల్లో కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్న తరణంలో ప్రజలు నిర్లక్ష్యం చేయడం సరికాదని ఝరాసంగం ఎస్సై (2) సమద్ అన్నారు. ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, వాహనాల పత్రాలతోపాటు మాస్క్లు లేకుండా ప్రయాణిస్తే రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. సెకండ్ వేవ్తో కేసులు పెద్ద సంఖ్య లో నమోదవుతుండగా కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నదన్నారు. అందుకు ప్రతి వ్యక్తి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వైరస్ నుంచి జాగ్రత్త పడవచ్చన్నారు. అందుకు ప్రతిఒక్కరూ బయటకి వెళ్లే ముందు మాస్క్ వేసుకొని వెళ్లాలన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది: ప్రియావారియర్
మహబూబ్నగర్ జిల్లాలో వడదెబ్బతో వ్యక్తి మృతి