కరోనా పాజిటివ్ అనగానే .. చనిపోతామనే భయందోళనకు గురవుతున్నారు. భయమే మరణానికి దారి తీస్తుంది. కరోనా విషయంలో భయం అవసరం లేదు. వైద్యుల సూచనలను పాటిస్తూ.. నిత్యం వ్యాయామం, సరైన భోజనం తీసుకుంటే త్వరగా కోలుకోగలమని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేశ్రెడ్డి స్పష్టం చేశారు. నెల రోజుల కిందట కరోనా బారినపడిన ఆయన దవాఖానలో చికిత్స పొందిన అనంతరం హోం క్వారంటైన్లో ఉండి ఏ విధంగా కరోనాను జయించారో ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం…
గత నెల (ఏప్రిల్) 8న ఒళ్లు నొప్పులతో జ్వరం వచ్చింది. మొదట వైరల్ ఫీవర్గా అనుకున్నాను. విధి నిర్వహణలో భాగంగా దుబ్బాక సర్కారు దవాఖానకు వెళ్లాను. ఆ సమయంలో కరోనా పరీక్షలు చేయించుకోగా…పాజిటీవ్ అని తేలింది. వెంటనే హైదరాబాద్లో ఓ ప్రైవేటు దవాఖానలో వారం రోజుల పాటు చికిత్స పొందాను. అనంతరం సిద్దిపేటలోని మా ఇంట్లో హోం క్వారంటైన్లో ఉండిపోయాను. ఈ క్రమంలో మా ఆవిడ చైతన్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె దవాఖానకు వెళ్లకుండా ఇం ట్లోనే హోం క్వారంటైన్లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు మందులు, భోజనం తీ సుకున్నాం. అదృష్టమేమిటంటే మా భా ర్యాభర్తలకు పాజిటివ్ వచ్చినా నాలు గేండ్ల మా బాబుకు రాలేదు. 15రో జుల పాటు హోంక్వారంటైన్లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు మందులు వాడటం, సమయానికి భోజనం తీసుకున్నాం. కరోనాను జయిం చాం. ప్రసుత్తం ప్రత్యేక జా గ్రత్తలు పాటిస్తూ.. విధు లు నిర్వహిస్తున్నా. పాజిటివ్ అనగానే చాలా మంది చనిపోతామని మెంటల్గా డిసైడ్ అవుతున్నారు. అది సరికాదు. ధైర్యంగా ఉండడంతో పాటు ఉల్లాసంగా ఉంటే కరోనాను సు నాయాసంగా జయించగలం. కుటుంబంలో ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చినా వారిని భయ పెట్టకుండా, ధైర్యన్ని అందిస్తే సులభంగా కోలుకుంటారు.
ఆత్మైస్థెర్యంతో ఎదుర్కోవాలి..
గత నెల 15న కరోనా లక్షణాలు కనిపించగానే వెంటే టెస్టు చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చింది. భయపడకుండా ప్రభుత్వ దవాఖానలో ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వేసుకున్నా. ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు ఉదయం, సాయంత్రం యోగా చేశా. ముఖ్యంగా వాకింగ్, ఆవిరి పట్టాను. 15 రోజుల తర్వాత మళ్లీ టెస్టు చేసుకోవడంతో నెగెటివ్ వచ్చింది. ప్రతిఒక్కరు కూడా కరోనా వచ్చిందని భయపడకుండా ధైర్యంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుంది.
ప్రజలు కరోనా వైరస్కు భయపడవద్దు
కరోనా వైరస్ సోకిందని నేను ఎలాంటి భయానికి లోను కాకుండా మానసికంగా, గుండె ధైర్యంతో కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేకమైన గదిలోనే ఉన్నాను. వైద్యులు సూచించిన సలహాల మేరకే 15 రోజులు పాటు మందు లను క్రమం తప్పకుండా వేసుకొని మంచి పౌష్టికాహారాన్ని స్వీకరించాను. గోరు వెచ్చని నీటిని ప్రతి రోజూ తాగుతూనే ఉదయం వేళలో బయటకు వెళ్లకుండా ఇంటిలోనే యోగాతో పాటు, వ్యాయామం చేశాను. వైద్యులు సూచించిన ప్రకారం 15 రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో నేను కరోనాను జయించాను. ప్రజలు కూడా కరోనా వచ్చినా భయ పడకుండా వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ను నయం చేసుకోవాలని కోరుతున్నాను.