జిన్నారం, ఏప్రిల్ 11 : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రం జిన్నారం, శివనగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జిన్నారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి అంబేద్కర్ ఎదుర్కొన్న వివక్ష నుంచి భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి అని, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. న్యాయవాదిగా, ఆర్థికశాస్త్రవేత్తగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహా నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. వెనుకబడిన వారి అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. అలాంటి గొప్ప నాయకుడ్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎంపీపీ రవీందర్గౌడ్, అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, మాజీ ఎంపీపీ నిర్మల, సర్పంచ్లు లావణ్య శ్రీనివాస్రెడ్డి, రేఖ కృష్ణ, జనార్దన్, శివరాజ్, ఆంజనేయులు, ఎంపీటీసీలు లావణ్య నరేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, ఏఐఎస్ఎస్డీ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
క్రీడారంగం అభివృద్ధికి కృషి
క్రీడారంగం అభివృద్ధికి సంపూర్ణ మద్దతునిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం జిన్నారంలోని గిరిజన గురుకుల పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన నవీన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులందరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆటల ద్వారా మానసికోల్లాసం లభిస్తుందన్నారు. ఉద్యోగ నియామకాల్లో నైపుణ్యంగల క్రీడాకారులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నానని, త్వరలోనే జిన్నారంలో మినీ స్టేడియం నిర్మాణం చేపడుతామన్నారు. అకాల మరణం చెందిన నవీన్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన అతడి స్నేహితులను అభినందించారు. అనంతరం కొద్ది సేపు ఎమ్మెల్యే క్రికెట్ బ్యాటింగ్ చేశా రు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు రవీందర్గౌడ్, దేవానంద్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ లావణ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
రేపు ఉగాది, శ్రీరామ నవరాత్రులు ప్రారంభం కొత్త వసంతం!