Double Murder | మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఇద్దరు మహిళల దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఇద్దరు మహిళలు మిస్సైనట్టు వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాండూరుకు చెందిన ఇద్దరుమహిళలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తోల్కట్ట గ్రామ సమీపంలో శవాలుగా మారారు.
కొందరు దుండగులు తాండూరు నుండి వృద్ధ మహిళలను తీసుకువెళ్లి హైదరాబాద్ శివారు ప్రాంతమైన చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో గల ఫామ్ హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి పూడ్చివేసినట్టు ఘటనా స్థలానికి వెళ్లిన తాండూరు పోలీసులు గుర్తించారు.
పైనాన్స్ డబ్బుల విషయంలో ఈ హత్య జరిగినట్టుగా భావిస్తున్న పోలీసులు.. దుండగులు డబ్బులు ఇస్తామని ఇద్దరు మహిళలను పిలిపించి హత్యచేసినట్టుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.