పరిగి, జనవరి 24: ఎనిమిదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లడంతోపాటు గ్రామాల వారీగా ఇంకా ఏవైనా చేపట్టాల్సిన పనులు ఉంటే తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు సక్సెస్ అయ్యాయి. పరిగి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలలో ఆత్మవిశ్వాసం నింపడంతోపాటు ఆత్మీయ సమ్మేళనాలు పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చాయని చెప్పవచ్చు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి డిసెంబర్ 6వ తేదీన పరిగి మండలం కాళ్లాపూర్లోని లొంక ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు పరిగి మండలంలో మూడు, దోమలో రెండు, పూడూరులో మూడు, కుల కచర్లలో రెండు, చౌడాపూర్లో రెండు, గండీడ్లో రెండు, మహ్మదాబాద్ మండలంలో రెండుచోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ప్రతిచోట కనీసం పదికి పైగా గ్రామపంచాయతీల నుంచి పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్కు చెందిన వారే ఎంపీపీలు, జడ్పీటీ సీలు ఉండగా, 90శాతం పైగా ఎంపీటీసీలు, సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిచోట నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు పెద్ద ఎత్తున పార్టీ కేడర్ కదిలివచ్చారు.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం…
ఆత్మీయ సమ్మేళనాలలో ప్రధానంగా ఎనిమిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశానికే తలమానికంగా నిలిచే విధంగా అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ది పనులు పార్టీ కార్యకర్తలు ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న రైతుబంధు కింద ఎకరాకు సంవత్సరానికి రూ.10వేలు పెట్టు బడి సాయం, రైతుబీమా ద్వారా ఏ కారణంగా రైతు చనిపోయినా రూ.5లక్షలు బీమా సదుపాయం, వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు సరఫరా, ఆసరా పింఛన్లు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఇతరులకు నెలకు రూ.2016, వికలాంగులకు రూ.3016 చొప్పున అంది ంచడం, పేదింటి యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ల కింద రూ.లక్షా 116 అందిస్తుండడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధి చేయబడిన తాగునీటి సరఫరా, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు సదుపాయం, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సదుపాయం, గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి గ్రామంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలపై వివరించారు.
ప్రధానంగా గతంలో ఏ సంక్షేమ పథకం ద్వారా లబ్ధిచేకూరాలన్నా పైరవీకారులను ఆశ్రయించాల్సి ఉండేది. అలాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పైరవీలకు తావు లేకుండా, ఏ ఒక్కరికీ చిల్లిగవ్వ ఇవ్వకుండా, నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. తద్వారా సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల కుటుం బాలు సంతోషంగా ఉన్నాయి. వాటితోపాటు కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సలు చేయిం చుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు. దళితబంధు పథకంపై విస్తృ త ప్రచారం కల్పించాలని సూచించారు. ప్రతిచోట పదికి పైగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో సమ్మేళ నాలు జరిపారు. సమావేశంలో ప్రతి గ్రామం నుంచి కనీసం ఒకరు మాట్లాడే అవకాశం కల్పించారు. ప్రతి గ్రామ పంచాయతీ వారిగా ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ది, అందుతున్న సంక్షేమ పథకాలపై విస్తృతం గా చర్చించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చడం జరి గింది, ఇంకా ఏ పనులు చేపట్టాల్సి ఉన్నాయనేది స్పష్టంగా తెలుసుకున్నారు. అందుకు అనుగుణంగా నిధుల కేటాయింపు సైతం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దిశా నిర్దేశం
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశానికే తలమా నికంగా నిలిచే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయ డం తోపాటు అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా కార్యకర్తలకు ఆత్మీయ సమ్మేళనాల్లో దిశా నిర్దేశం చేశాం.ప్రతి గ్రామపంచాయతీ వారిగా ప్రత్యేకంగా సమావేశాలు జరిపి చేపట్టిన అభివృద్ధి అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను తెలుసు కోవడంతోపాటు ఎన్ని కల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఏవైనా మిగిలి పోతే వాటి అమలుకు నిధులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గత సంవత్సరం రూ.20కోట్లు, ఈసారి రూ.20కోట్లు సీసీ రోడ్లకు మంజూ రయ్యాయి. ఇటీవల సీఎం కేసీఆర్ రూ.10కోట్లు నియోజకవర్గానికి ప్రకటించడంతో అవసరమైన గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేటాయిస్తాం.
-కొప్పుల మహేశ్రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి