పరిగి : దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో 78మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేదలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని చెప్పారు. ఏ ఒక్కరికి రూపాయి ఇవ్వకుండా, పైరవీ చేయకుండానే ఈ పథకాలు అమలు చేయడం చాలా గొప్ప విషయమన్నారు.
ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు పింఛన్ ద్వారా ఆయా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని చెప్పారు. 57 ఏళ్లు నిండిన వారికి త్వరలోనే పింఛన్లు అందనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, ఆర్ఐలు నరేందర్, వెంకట్రాంరెడ్డి, సర్పంచ్లు నల్క జగన్, గణేష్, ఎంపీటీసీ పర్శవేది, లబ్ధిదారులు పాల్గొన్నారు.