శంకర్పల్లి, డిసెంబర్ 19: మండలంలోని ప్రొద్దటూర్ గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నది. మండలంలోని మిగతా గ్రామాల కు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రభుత్వం కేటాయిస్తున్న పల్లెప్రగతి నిధులతో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆ నిధులతో పల్లెప్రకృతి వనం, సీసీ రోడ్లు, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, వీధి దీపాలు, హరితహారం నర్సరీ తదితర అభివృద్ధి పథకాలను వార్డుసభ్యులు, అధికా రులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సర్పంచ్ పూర్తి చేశారు. గ్రా మంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీసీ రోడ్లు.. పల్లెప్రకృతి వనం..
గత ళూపభుత్వాల ప్రొద్దటూర్ ళూగామం దూరం గా ఉండేది. రోడ్లు గుంతలమయంగా, నడిచేందుకు వీలు లేకుండా ఉండే వి. అయితే సీఎం కేసీఆర్ పాలనలో గ్రామ రూపురేఖలు మారాయి. సీసీ రోడ్లు వేశారు. వీధి దీపాలను ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చూపరులను ఆకట్టు కుంటున్నాయి. పల్లె ప్రకృతివనంతో ఏపుగా పెరిగిన చెట్లతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించడంతో గ్రామంలో మురుగునీటి సమస్య పరిష్కారమైనది. అలాగే ప్రతిరోజూ పారిశుధ్య కార్మికులు ఊరిని శుభ్రంగా ఉంచుతున్నారు. ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి పల్లెప్రగతి నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ ఆ చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసి హరితహారం నర్సరీ, పల్లెప్రకృతివనంలోని మొక్కలకు వినియోగిస్తున్నారు. ప్ర భుత్వ పథకాలు ఇంటింటికీ చేరాయి. ప్రతి ఒక్కరూ లబ్ధిపొందుతున్నారు.
మౌలిక వసతులు కల్పిస్తా
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చాలా వరకు పూర్తి చేశా. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా. – ఏనుగు నర్సింహారెడ్డి, సర్పంచ్, ప్రొద్దటూర్
తెలంగాణ అభివృద్ధ్ది కేసీఆర్ తోనే సాధ్యం
పల్లె ప్రగతితోగ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అందుతున్నాయి. ఇప్పటివరకు మండలంలోని అన్ని గ్రామాల్లో హరితహారం నర్సరీలు, పల్లెప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
– గోవర్ధన్రెడ్డి, ఎంపీపీ, శంకర్పల్లి