వికారాబాద్, జూన్ 8 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం పల్లె ప్రగతిలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలనుసందర్శించి, మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలో చేపట్టాల్సిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన వడ్లు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులకు ఇబ్బంది కలగకుండా తొందరగా కొనుగోలు చేయాలని సూచించారు.
వడ్లు నింపడానికి సరఫరా చేసిన సంచులు రంధ్రాలు లేకుండా మంచివి సరిఫరా చేయాలని జిల్లా సివిల్ సైప్లె అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, సర్పంచ్ వెంకటేశం, గ్రామస్తులు , పార్టీ నాయకులు పాల్గొన్నారు.