కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన మల్లయ్యకి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో రూ. లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆదివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారుడికి ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ దవాఖానలో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని, ఈ పథకం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిదని తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకోబా, నాయకులు సత్తిరెడ్డి, పట్టాభిరాంరెడ్డి, వెంకట్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.