తాండూరు, జూన్ 9 : ప్రజా ప్రతినిధులు, అధికారులు అంకిత భావంతో ప్రజా సేవ చేయాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సూచించారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 12, 17, 25, 26వ వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
12వ వార్డుల్లో తెలంగాణ క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. 17వ వార్డులో ప్రజా సమస్యలను తెలుసుకుని మొక్కలు నాటారు.
25, 26వ వార్డుల్లో పర్యటించి తడి, పొడి చెత్తబుట్లను పంపిణీ చేశారు. తాండూరు పట్టణానికి చెందిన రవికుమార్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యం తగదన్నారు.
తాండూరును కాలుష్యరహితంగా మార్చేందుకు ఔటర్ రింగురోడ్డు, నాణ్యతతో కూడిన హైవే రోడ్లతో పాటు మున్సిపల్ పరిధిలో పార్కులు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు.
కాగా, బీజేపీ యువనాయకుడు అభిషేక్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో ఆర్టీవో అశోక్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, కౌన్సిలర్లు తదితరులున్నారు.