కోట్పల్లి, మే 31 : గ్రామాల్లో ఉన్న సమస్యలను తీర్చేందుకే మీతో నేను కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంటింటికీ తిరిగి వెంటనే సంబంధిత అధికారుల సమక్ష్యంలోనే సమస్యలు పరిష్కరిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని కరీంపూర్ గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఉదయం 7గంటలకు గ్రామానికి వచ్చి ఇంటింటికీ తిరిగి పలకరిస్తూ.. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా? ఏవైన సమస్యలున్నాయా? అంటూ అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఇంటింటికి తిరిగి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలు వారి దృష్టికి తేగా అక్కడే ఉన్న ఏఈతో ఈ సమస్యను వారంలో పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామానికి వికారాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సును ఉదయం, సాయంత్ర రెండు పూటలు గ్రామంలోకి వచ్చే నడుపాలని గ్రామస్తులు కోరగా వెంటనే ఎమ్మెల్యే ఆర్టీసీ డీఎంతో పోన్లో మాట్లాడి గ్రామంలోకి బస్సును నడుపాలను సూచించారు.
అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు రూ.15 లక్షల సీసీ రోడ్లు, రూ.5లక్షల పార్మిషన్ రోడ్డు, రూ.5లక్షల స్ట్రీట్ లైట్లు, కొత్త హంగులతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అలాగే గ్రామంలో లక్ష రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినారు. అనంతరం ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో లెని పథకాలను తెచ్చి ప్రజలకు ఆర్థికంగా తోడ్పాటునిస్తుందని అన్నారు.