కందుకూరు : కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడు కోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabhita Indrareddy) ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. నీటి ప్రాజెక్టుల (Irrigations) పై కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని విమర్శించారు. బుధవారం కందుకూరులో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
తెలంగాణను కొట్లాడి సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే కేసీఆర్(KCR) ఉద్యమానికి పిలుపును ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ(Public Meeting) ను నిర్వహిస్తుందని, ఈ సభలో ప్రభుత్వ ప్రమాదకర దోరణిని ఎండగడుతామని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులు తేలే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీ (KRMB) కి అప్పగించాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి. మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.