ధారూరు, జూన్ 20: దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ధారూరు మండల కేంద్రానికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడు యాదగిరికి టోయాటా కారును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే దళితుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. దీనిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతి నిధులు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.