దోమ,ఆగస్టు 8 : రైతుపై అడవి పంది దాడి చేసి గాయ పరిచిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లి గ్రామంలో చోటుచేసుక్నుది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం ..గ్రామానికి చెందిన చెక్కలి హనుమయ్య(56) ఉదయం దాదాపు 8 గంటల సమయంలో తన పొలానికి వెళ్తున్న క్రమంలో మార్గామధ్యలో హనుమయ్యపై అడవి పంది దాడిచేసింది.
అది గమనించిన తోటి రైతులు అరుస్తూ పంది వెంట పడటంతో పక్కనే ఉన్న బోరుమోటరు స్టాటర్కు తగలడంతో కరెంటు శాక్ తగిలి అడవి పంది అక్కడికక్కడే మృతి చెందింది. దాడికి గురైన రైతును తోటి రైతులు దవాఖానకు తరలించారు.