కోట్పల్లి, ఆగస్టు 03 : రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
బుధవారం కోట్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బెగరి లక్ష్మణ్కు మంజూరైనాటెంట్ హౌజ్ను, ఎన్కెపల్లి గ్రామానికి చెందిన సాయన్న (సత్యం) కు స్టీల్, సిమెంట్ షాపు లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకం ద్వారా రూ.10లక్షల రూపాయలు ఉచితంగా మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఎంచుకున్న యూనిట్లతో లబ్ధిదారులు ఆర్థికంగా ఎదుగాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడులు అనిల్కుమార్, పిఎసిఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, స్థానిక సర్పంచ్ అనితారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, తదితరులు పాల్గొన్నారు.