షాద్నగర్టౌన్ : ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి కొండంత భరోసానిస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం హాజిపల్లి గ్రామానికి చెందిన ఇస్నాతి శ్రీనివాసుకు రూ. 60వేలు, శంకరయ్యకు రూ. 60వేలు, లింగంకు రూ. 23వేలు, కిషన్నగర్ గ్రామానికి చెందిన విజయకు రూ. 60వేలు, హరిశంకర్కు రూ. 60వేలు, చింతగూడ గ్రామానికి శేఖర్కు రూ. 42వేలు, బూర్గుల గ్రామానికి చెందిన రాజుకు రూ. 30వేల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేద అభ్యన్నతికీ తెలంగాణ సర్కార్ ఆహర్నిశలు కృషి చేస్తుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రజాసంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం సహాయనిధి చెక్కులు అందజేయడం పట్ల లబ్ధిదారులు సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, సర్పంచ్ శ్రీశైలం, నాయకుడు మచ్చేందర్, రవి పాల్గొన్నారు.