వికారాబాద్, ఆగస్టు 5 : కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) జెండాను ఆవిష్కరించారు. అనంతరం వికారాబాద్ క్లబ్ ఫంక్షన్హాలులో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని విధాలుగా కార్మికులను ఆధుకునేందుకు మరింతగా కృషి చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్గౌడ్, జిల్లా కార్యదర్శి రుక్మయ్య, జిల్లా అధ్యక్షులు రఘునందన్గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.