వికారాబాద్, ఆగస్టు 7 : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలో 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నందున, ఈ నెల 8న(సోమవారం) ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అధికారులందరూ వజ్రోత్సవ కార్యక్రమాలలో బిజీగా ఉన్నందునా ప్రజావాణి నిర్వహించడం లేదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందస్తుగా తెలియజేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.