వికారాబాద్ : మన ఊరు- మన బడితో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామంలో మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు సర్కారు ఏర్పాట్లు చేస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎంపీపీ అరవింద రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సురేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.