School Bus | రంగారెడ్డి : విద్యార్థుల రవాణా కోసం వినియోగించాల్సిన స్కూల్ బస్సులను నిబంధనలకు విరుద్దంగా దుర్వినియోగం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సును కిరాయికి నడుపుతూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న స్థానికులు స్కూల్ బస్సును ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.
అయితే ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపల్ను వివరణ కోరగా మాట్లాడడానికి నిరాకరించాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సు దుర్వినియోగం
విద్యార్థుల రవాణా కోసం వినియోగించాల్సిన బస్సులను పెళ్లిళ్లు, శుభకార్యాలకు కిరాయికి నడుపుతున్నారని ఆరోపిస్తున్న స్థానికులు
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సును ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పట్టుకుని… pic.twitter.com/d8HEhMexJ0
— Telugu Scribe (@TeluguScribe) May 4, 2026