తిరుపతి : హైదరాబాద్కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు (Anonymous Devotee ) తిరుమల ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ.1 కోటి విరాళం ( One Crore Donations ) అందజేశారు. ఈ మేరకు టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో విరాళం డిమాండ్ డ్రాఫ్ట్ను సోమవారం టీటీడీ ఈవో ఎం. రవిచంద్రకు అందజేశారు.ఈ సందర్భంగా అజ్ఞాత భక్తుడి దాతృత్వాన్ని ఈవో అభినందిస్తూ, అన్నప్రసాద సేవకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

భువనేశ్వర్కు చెందిన బల్భద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,000 విరాళంగా అందించింది. ఆ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర తిరుమల అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.