పరిగి : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని తమ నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 51 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 19. 83 లక్షలకు సంబంధించిన చెక్కులు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్న పేదలకు సీఎం రిలిఫ్ ఫండ్ ద్వారా సర్కారు ఆర్థికంగా ఆదుకుంటుందని తెలిపారు. మరోవైపు సర్కారు దవాఖానలో నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కార్యక్రమంలో దోమ, పూడూరు జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, మలిపెద్ది మేఘమాల, పరిగి ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ చైర్మన్ ఎ.సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు ఆర్.ఆంజనేయులు, గోపాల్, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.