షాబాద్, మే 6: బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కాసాని జ్ఞానేశ్వర్ సతీమణి కాసాని చంద్రకళ, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి సతీమణి పట్నం సాన్విరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాగరకుంట, బోనగిరిపల్లి, దైవాలగూడ, చందనవెళ్లి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పలు గ్రామాల్లో మహిళలు రామక్క పాటకు డ్యాన్సు చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయన్నారు. కరెంట్, నీటి సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారని ఆరోపించారు. చేవెళ్ల ఎంపీగా బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీల కల్లబొల్లి మాటలను నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, కాసాని జ్ఞానేశ్వర్ కుమార్తె మాధవి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నక్క శ్రీనివాస్గౌడ్, శేరిగూడెం వెంకటయ్య, మాజీ సర్పంచులు కొలన్ ప్రభాకర్రెడ్డి, పోనమోని కేతన, మాజీ ఎంపీటీసీ గడీల నీరజ, నాయకులు కృష్ణాగౌడ్, విష్ణు, రమేశ్యాదవ్, రాందేవ్యాదవ్, వెంకటయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు