పెద్దఅంబర్పేట, మే 6: కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ డ్రామాలేనని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేటలో నిర్వహించిన రోడ్ షోలో వారు మాట్లాడారు. కాంగ్రెస్తోనే కరువొచ్చిందని, ప్రజలకు కష్టాలూ వచ్చాయని ఆరోపించారు. లేనిపోని హామీలతో అబద్ధాలు చెప్పి మభ్యపెట్టిన హస్తం పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు అంటూ మాయమాటలు చెప్పి, కాంగ్రెస్ చేతులెత్తేసిందని విమర్శించారు. హామీలు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ వాటిని అమలుపర్చడంలో కాంగ్రెస్కు లేదన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం మొత్తం బడాబాబుల చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుక క్యామ మల్లేశ్కు మద్దతు తెలుపాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.