Hyderabad | హైదరాబాద్లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ బస్ డిపో ముందు పట్టపగలే అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.
చనిపోయిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్గా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఉమేశ్పై కత్తులతో దాడి చేస్తుండగా అక్కడే ఉన్న జనం చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. పైగా, ఈ తతంగమంతా వీడియో చూస్తూ ఉండిపోవడం గమనార్హం.