కుత్బుల్లాపూర్,సెప్టెంబర్13 : గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు. జిల్లా అదనపు సూపరిండెంట్ మాధవయ్య పర్యవేక్షణలో ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ టీంతో కలిసి విశ్వసనీయంగా వచ్చిన సమాచారం మేరకు కూకట్పల్లి, ప్రకాశ్నగర్లో ఓఇంటిపై దాడులు చేపట్టారు.
ఈ దాడిలో నెల్లికుదురు కల్యాణ్(22), నెల్లికుదురు నితిన్(20) కె.తరుణ్(20) ముగ్గురు యువకులు గత కొంతకాలంగా ఎండు గంజాయిని విక్రయిస్తున్నట్లు తేలింది. వారి వద్ద కేజీ 150 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ సహదేవుడు, బాలానగర్ సీఐ డి.వేణుగోపాల్, సంజయ్, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.