చర్లపల్లి : ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ కోరారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జైజవాన్ కాలనీలో మేడ్చల్ జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పత్రాలను దగ్దం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ వికలాంగుల పాలిట శాపంగా మారిందని, 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 34ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించాలని ఆయన కొరారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలో లక్షలాది వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను ఉన్నాయని, వాటని భర్తీ చేయకుండా వికంలాగులను మోసం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళ రాష్ట్ర కన్వీనర్ నాగలక్ష్మి, నాయకులు షేన్బేగం, అమరావతి, నవ్య, బుచ్చమ్మ, శేఖర్, ప్రసాద్, యాదమ్మ, రిజ్వాన్, సుభాషీణి తదితరులు పాల్గొన్నారు.