HomeTelanganaThree Sarpanches Join Brs Induction Into The Party Takes Place In The Presence Of Ktr
బీఆర్ఎస్లోకి ముగ్గురు సర్పంచ్లు.. కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిక
హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు.
హుజూరాబాద్లో బీజేపీకి షాక్
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో సిరిసేడు, వంతడుపుల, టేకుర్తి సర్పంచ్లు హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. సిరిసేడు సర్పంచ్ కుమార్ – శ్యామల, వంతడుపుల సర్పంచ్ రాజేశ్- మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ తదితరులను కేటీఆర్ సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
సర్పంచ్లు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల మనసుల్లో చెకుచెదరలేదని స్పష్టంచేశారు. బీజేపీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలతో విసిగిన గ్రామస్థాయి నాయకులు, ప్రజలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని, ఆయన నాయకత్వంపై పూర్తివిశ్వాసం ఉన్నదని పేరొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెంకటేశ్ పాల్గొన్నారు.