దుండిగల్: బాచుపల్లిలోని ప్రముఖ విద్యాసంస్థ బివిఆర్టి ఎడ్యుకేషన్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగం ఉమెన్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కెవిఎన్ సునీత అధ్యక్షతన అటల్ టీచింగ్ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ నెల 9 నుంచి13 వరకు జరిగిన ఈ శిక్షణ తరగతులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పథకంలో భాగంగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణా తరగతుల్లో దేశవ్యాప్తంగా 170 మంది అధ్యాపకులు హాజరుకాగా ముఖ్యఅతిధిగా కల్నల్ డా.డిఎస్ సురేంద్ర హజరై ఆర్టిఫిషియల్ ఇంటలీజన్స్ టెక్నిక్స్ ఇన్ రెన్యువేబుల్ ఎనర్జి రిసోర్స్ కంట్రోల్ టెక్నిక్స్పై చర్చించారు.
ఈ సదస్సులో 10 మంది సబ్జెక్టు నిపుణులు దేశంలోని ఐఐటి, ఎన్ఐటిల నుంచి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయా విశ్వవిద్యాలయాల నిపుణులు డా.ప్రకాశ్, డా.శ్రీనివాస్, డా.వి.సందీప్, డా.ఎస్.శ్రీజత్, డా.ఎన్.రాజశేఖర్, డా.రాకేశ్చంద్ర, డా.ఎం.వెంకటేశంలతో పాటు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సునీల్కుమార్, డిపార్ట్మెంట్ హెడ్ జె.నాగవిష్ణువర్ధన్ తదతరులు పాల్గొన్నారు.