రామంతాపూర్ : తల్లి,దండ్రులు లేని ఓ అనాథ బాలిక అన్న పూర్ణ (18 ) గత కొన్ని రోజులుగా రోడ్డు పై తిరుగుతుండగా సురక్షిత్ సేవా ట్రస్టు సభ్యులు బాలికను చేరదీసి అంబర్ పేట పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ట్రస్టు అధ్యక్షురాలు అర్పిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాథ బాలిక కు పోలీసుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి ప్రభుత్వ సంరక్షణలో ఉన్న హోం లో ఉంచుతామన్నారు. అనాథల సంక్షేమం కోసం తమ ట్రస్టు కృషి చేస్తుందని అన్నారు. రామంతాపూర్ సురక్షిత్ సేవాట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షురాలు అర్పిత మాట్లాడుతూ నగరంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని తమ ట్రస్టు చేపట్టిందన్నారు.