మేడ్చల్ : పార్కు స్థలాల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని శిల్పా నగర్లో పార్కుకు నిర్మిస్తున్న ప్రహరీ పనులను శుక్రవారం చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి పార్కుకు ప్రహరీ నిర్మించి, అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ సుదర్శనం రఘు, కౌన్సిలర్ కౌకుట్ల అనంత్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.