Kaleshwaram Project : వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణ రైతాంగం సాగునీటికి గోస పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంపై హైకోర్టులో పిటిషన్ నమోదైంది. కాళేళ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో కుంగిన బ్యారేజీలకు మరమ్మతు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ శరత్ అనే న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు మరమ్మతలపై అలసత్వాన్ని ప్రశ్నించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ ధర్మాసనంలో పిటిషన్ వేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన బ్యారేజీలకు మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ(NDSA) పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాది శరత్ వాపోయారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు.
అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టులపై నివేదికను సమర్పించిన ఎన్డీఎస్ను మరోసారి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలను పరిశీలించేందుకు వెళ్లాల్సిందిగా ఆదేశించాలని న్యాయవాది శరత్ తన పిటిషన్లో కోరారు. దాంతో, ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై జూలై 20, సోమవారం ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అందువల్ల.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.