హనుమకొండ చౌరస్తా, జూలై 15: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం నూతన సిలబస్కు అనుగుణంగా రూపొందించిన ‘ఇంగ్లీష్ ఫర్ మాస్టరీ’ పుస్తకాన్ని వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి డాక్టర్ బి.దీపాజ్యోతి, డాక్టర్ ఆర్.మేఘనారావు, పి.నిర్మల సంపాదకులుగా వ్యవహరిచారు.
నూతన సిలబస్కు తగ్గట్టుగా విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ‘ఇంగ్లీష్ ఫర్ మాస్టరీ’ని రూపొందించినట్లు వీసీ తెలిపారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామిరెడ్డి, పాలక మండలి సభ్యులు బి.సురేష్ లాల్, మల్లం నవీన్, ప్రిన్సిపాల్స్ టి.మనోహర్, ఎస్.నరసింహచారి, సహాయ రిజిస్ట్రార్ కోలా శంకర్ పాల్గొన్నారు.