కీసర, ఆగస్టు:కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణమాసోత్సవం పూజలు ప్రారంభమయ్యాయి. శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గర్భగుడిలో శ్రీ రామలింగేశ్వరుడికి తేనే, ఆవుపాలు, నెయ్యి, పంచామృతంతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.
శివుడికి ఇష్టమైన రోజు సోమవారం కావడంతో శివభక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్టకు విచ్చేసి స్వామివారికి గర్భాలయంలో అభిషేకాలు నిర్వహించారు. ఆలయం తరుపున కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్రెడ్డిలు తెలిపారు.