మేడ్చల్ : గ్రామీణ నిరుద్యోగ యువతకు (డిడియు-జీకేవై కార్యక్రమం) ద్వారా శిక్షణ,ఉపాధి కల్పనకు మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 16న అర్హులను గుర్తించడానికి సదస్సు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ శశిరేఖ ఓ ప్రకటనలో తెలిపారు. 16న సోమవారం ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ఈ శిబిరానికి అర్హత, ఆసక్తి గల మేడ్చల్ మండల గ్రామీణ నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.