కీసర: రైతుబీమా ఆర్థిక సహాయాన్ని రైతులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్ తెలిపారు. మండల పరిధి భోగారం గ్రామానికి చెందిన సుంకరి శంకర్ ఇటీవల మృతిచెందాడు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు రైతుబీమా కింద రూ.5లక్షల చెక్ను అందించింది. ఆ చెక్ను మృతుడి కుటుంబసభ్యులకు శుక్రవారం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, భోగారం మాజీ సర్పంచ్ రాగి రాఘవేంద్రారెడ్డిలు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతాంగానికి తగిన న్యాయం జరుగుతుందని గుర్తు చేశారు.
రైతులు పండిస్తున్న పంటలకు పంట రుణాలు, ఎరువులు, పండించిన పంటలను ఏకంగా ప్రభుత్వమే కోనుగోలు చేస్తుందని అన్నారు. అంతేకాదు రైతు ప్రమాదవశాత్తు మృతిచెందితే వారి కుటుంబం రోడ్డున పడకుండా మన సీఎం కేసీఆర్ వారికి రైతుబీమా కింద రూ.5లక్షలను ఇచ్చి అండగా ఉండి వారి కుటుంబానికి భరోసా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భోగారం కో-ఆప్షన్ సభ్యులు డబ్బి నర్సింహరెడ్డి, మండల రైతుబంధు కో-ఆర్డీనేటర్ పడమటి నర్సింహరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గన్నేర్ల సత్యనారాయణ, భోగారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.