మేడ్చల్ కలెక్టరేట్: మంచి నీటి పైప్లైన్ పనులకు రూ.35 కోట్ల ప్రతిపాదనలు చేసినట్లు నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలలో నూతనంగా పైప్లైన్ పనులు చేపటేందుకు చైర్మన్ అధికారులతో కలసి పైప్లైన్ పనులకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.