కీసర: రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా కీసరగుట్టలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసోత్సవంలో భాగంగా రెండవ సోమవారం కావడంతో శివభక్తులు ఆవుపాలు, తేనే, పాలు,పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వేదపండితులు స్వామివారిని పల్లకీసేవలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు అడుగడుగునా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం కీసరగుట్టకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ తెలిపారు.