శామీర్పేట : పీసీవీ చిన్నారుల పాలిట శ్రీరామరక్ష అని ఎంపీపీ హారికముళిగౌడ్ అన్నారు. మూడుచింతల్పల్లి మండలంలో పీసీవీ వ్యాక్సిన్పై అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ చిన్నారుల్లో నిమోనియా, మెదడువాపు వ్యాధులు రాకుండా పీసీవీ వ్యాక్సిన్ నివారిస్తుందన్నారు. చిన్నారులకు 6 నెలల నుంచి 1 సంవత్సరంలోపు వయస్సు గల పిల్లలకు మూడు సార్లు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సువిద, తాసీల్దార్ రాజేశ్వర్రెడ్డి, వైద్యాధికారి దమయంతి, సర్పంచ్ జామ్ రవి, సిబ్బంది పాల్గొన్నారు.