మల్కాజిగిరి : దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, దేశభక్తి గీతాల పోటీని అక్షర కౌముదీ, అక్షరామృతం సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 15న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తులసి రమణాచార్యులు తెలిపారు. ఆన్లైన్లో 15న సాయంత్రం ఈ పోటీలను నిర్వహిస్తామని 5 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులు ఈ పోటీలకు అర్హులని అన్నారు. విజేతలకు నగదు బహుమతితోపాటు ప్రశంసా పత్రాలు అందజేస్తామని అన్నారు. ఆసక్తి కలిగిన వారు 8374619117 సంప్రదించవచ్చని తులసి రమణాచార్యులు పేర్కొన్నారు.