మల్లాపూర్: పేద మద్యతరగతి విద్యార్ధులను ఆదుకునేందుకు గత 15 సంవత్సరాలుగా లక్ష్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నెహ్రునగర్, లక్ష్మీనగర్, శుభాష్నగర్ పాఠశాలల విద్యార్ధులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, స్టేషనరీ ఐటమ్స్ అందజేశారు. ఈ సందర్బంగా సంస్ధ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతీ ఏటా విద్యార్ధులకు నోటు పుస్తకాలతో పాటు స్కూల్ బ్యాగ్స్, షూస్, అందించడం జరుగుతుందన్నారు.
రెండు సంవత్సరాల క్రితం విద్యార్ధుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు క్విజ్, చిత్రలేఖనం, పాటల పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చామని కరోనా కారణంగా అటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోయామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ సునిల్కుమార్, ఫౌండేషన్ అధ్యక్షురాలు షీలా , కోశాధికారి జెవి.హెచ్ సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు కుల్దీస్సింగ్, అంజిరెడ్డి, ఇందిర, పి. సురేశ్, పాండురంగం, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.