మేడ్చల్ : వైకుంఠదామంలో అన్ని వసతులు కల్పిస్తామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో కోటి రూపాయిలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠధామం అభివృద్ధి పనులను సోమవారం చైర్మన్ చంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠధామం అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. పనులలో నాణ్యత పాటించాలని, పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నంరాజు సుమిత్ర సురేష్, వార్డు కమిటి సభ్యులు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.