కుత్బుల్లాపూర్: నాగులపంచమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలతో మహిళలతో కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్లు, ఇతర ప్రదేశాలతో పాటు గ్రామదేవతల ఆలయాల ఉన్న పుట్టల వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని కుంకుమార్చన, పుష్పార్చనతో పాటు పుట్టలో పాలాభిషేకం చేసి ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. గాజులరామారం, జీడిమెట్ల, షాపూర్నగర్, పేట్ బషీరాబాద్, నిజాంపేట, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటి పరిధి నియోజకవర్గ వ్యాప్తంగా వైభవంగా జరిగాయి.నిజాంపేట మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి నిజాంపేట హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శివలింగానికి అభిషేకం చేశారు.