మేడ్చల్ కలెక్టరేట్: వారాంతపు సంతలోని వీధి వ్యాపారులకు ప్రత్యేక దుకాణ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో వారాంతపు సంత వ్యాపారుల కోసం దుకాణ సముదాయ నిర్మాణ పనులకు చంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, కమిషనర్ వాణిరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.