కీసర: మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతాంగానికి మార్టిగేజ్ అగ్రికల్చర్ కింద రుణాలందిస్తామని కీసర మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఎకరానికి రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకు రుణాలందిస్తామన్నారు. ఆసక్తి గల రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్కార్డు తీసుకొని కీసర ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.