MLA Bandari Lakshma Reddy | రామంతాపూర్, జూలై 15 : రామంతాపూర్ భగాయత్ వెంకట సాయి నగర్ కాలనీ సర్వే నెంబర్ 40, 40/A బీరప్ప దేవాలయం వెనకాల లైన్లో మంజూరై అయి ప్రారంభోత్సవం జరగాల్సినటువంటి బ్రిడ్జ్ స్థలాన్ని ఈ రోజు కాలనీవాసులతో కలిసి మంగళ వారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బాక్స్ కల్వర్టు పనులను వచ్చే వారంలో ప్రారంభిస్తానని వాటితోపాటు కాలనీలో డ్రైనేజీ లైన్లు సీసీ రోడ్లు సాంక్షన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంధం నాగేశ్వరరావు, సర్వ సత్తయ్య యాదవ్, రమేష్ గౌడ్, జర్నలిస్ట్ ఏ విజయేందర్ రెడ్డి, శంకర్, రమేష్ యాదవ్, హుస్సేన్, శివ యాదవ్, ఐలేష్ యాదవ్, గోపాల్,అశోక్, గోవింద్, శీను, పరశురాం, కీర్తి తదితరులు పాల్గొన్నారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి