దుండిగల్, ఆగస్టు :కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ.వివేకానంద్ శనివారం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో పర్యటించారు. ఆయనతో పాటు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి, కమిషనర్ గోపీ ఉన్నారు. ఈ సందర్భంగా 17వ డివిజన్ పరిధిలోని కౌసల్యకాలనీ,సాయికృష్ణజా హిల్స్లలో స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా సాయికృష్ణజా హిల్స్ కాలనీలో ప్రధాన రహదారి నిర్మాణంతో పాటు భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టాలని, కౌసల్యకాలనీలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డుపై సెకెండ్ లేయర్ వేయాలనీ,పార్కుల చుట్టూ ప్రహరీగోడలను నిర్మించాలని,టర్బో నుంచి ఎస్ఎస్కే ఫ్లాంట్ వరకు, ఎన్ఆర్ఐ కళాశాల నుంచి ఆగంనాగయ్య చిల్డ్రన్స్ పార్కు వరకు పెండింగ్లో ఉన్న డ్రైనేజీ నిర్మాణపనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు స్థానిక కార్పొరేటర్ ఆగంరాజు ముదిరాజు విన్నవించారు.
అదే విధంగా ఆగం నాగయ్య చిల్డ్రన్స్ పార్కులో ఓపేన్ జిమ్ ఏర్పాటుతో పాటు వాకింగ్ట్రాక్ నిర్మించాలని కోరారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ 17వ డివిజన్ పరిధిలోని కాసానీ కౌసల్యకాలనీ, సాయికృష్ణజా హిల్స్ కాలనీలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వర్షపు నీరు శుభ్రత, శుధ్దీకరణ కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ రూ,300 కోట్లు ఇస్తామన్న విషయాన్ని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాకారంతో నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చి దిద్దుతామన్నారు. ఈ సందర్భంగా రూ,300 కోట్లు కేటాయిస్తామనిప్రకటించినందుకుమంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఆయా కాలనీలల్లో మొక్కలు నాటి, నీరు పోశారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధన్రాజు, కార్పొరేటర్లు ఆగంపాండు ముదిరాజు ,విజయలక్ష్మీ తదితరులతో పాటు టీఆర్ఎస్ నేతలు, ఆయా కాలనీలవాసులు పాల్గొన్నారు.